జగిత్యాల: జిల్లా ఫారెస్ట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన సలికె మురళి శుక్రవారం బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీర్పూర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం గుట్ట కింది ప్రాంతంలో సుమారు 20 ఎకరాల అటవీ భూమి ఆక్రమించి అక్రమంగా సాగు చేసుకుంటున్నారని గత మూడు నెలల క్రితం డిఎఫ్వోకు ఫిర్యాదు చేశానని, ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోలేదన్నాడు.