జగిత్యాలలో దొంగలు తెగబడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున శంకులపల్లి, శివాజీవాడ, బైపాస్ రోడ్డు లో గల మూడు ఇళ్లలో చోరీ జరిగింది. ఆరు తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వరుస చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.