జగిత్యాల జిల్లా జాబితాపూర్లో విషాద ఘటన జరిగింది. అక్కడి కి చెందిన బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని శాటిపల్లి సత్య, హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. చదువులో వెనుకబడిందంటూ స్నేహితులు వైష్ణవి, సంజన అవమానించడంతో, నిత్య ఈ నెల 3న ఇంటికి వెళ్లి గడ్డి మందు తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.