జగిత్యాల పట్టణంలోని పట్టణ 14వ, 13వ వార్డులలో 40 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ కౌన్సిలర్ లు కూతురు పద్మ, కమాల్ , మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు అడువల లక్ష్మణ్, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, ఏఈ శరన్, పట్టణ, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.