జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మంగళవారం పోచమ్మ వాడ నాయుడు చౌరస్తా వద్ద, పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా, రాష్ డ్రైవింగ్, వాహన పత్రాలు లేని వాటిని గుర్తించి జరిమానాలు విధించారు. ప్రతి వాహనదారునికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కేసు నమోదు చేశారు.