తాను భారత దేశానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టలేదని ప్రొఫెసర్, విద్యా కమిషన్ అడ్వైజరీ మెంబర్ సురేపల్లి సుజాత గురువారం అన్నారు. ఆమె మాట్లాడుతూ. టెర్రరిస్టులు మన దేశంపై అటాక్ చేస్తే బాధపడ్డానని చెప్పారు. అనర్థాలను తెలియజెప్పే ఉద్దేశంలో పెట్టాను తప్పా భారతదేశానికి వ్యతిరేకంగా పెట్టలేదని పేర్కొన్నారు. ఆ పోస్టు వల్ల మీరందరూ బాధపడితే క్షమాపణలు కోరుతున్నాను అని ఆమె స్పష్టం చేశారు.