బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు మంగళవారం పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రేపు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని వినికిడి.