కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని డీఈవో ఆఫీస్లో విషాదం చోటుచేసుకుంది. అదే ఆఫీస్లో అటెండర్గా పనిచేస్తున్న రవీందర్ అనే వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కట్ట రాంపూర్కు చెందిన వ్యక్తి అని తోటి ఉద్యోగులు మంగళవారం తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.