కరీంనగర్ పట్టణంలో, కొత్తపల్లి, తీగలగుట్టపల్లి, తదితర మున్సిపాలిటీల పరిధిలో వాహనాల చోరీలు అధికంగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో పని చేయకపోవడంతో వాహనాల చోరీలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని బుధవారం బాధితులు ఆందోళన చెందుతున్నారు. వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమీషనర్ ను వాహనదారులు కోరుతున్నారు.