కరీంనగర్ నియోజకవర్గం మల్కాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రజలతో బుదవారం ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు ఎలాంటి పథకాలు రావడంలేదని ఎమ్మెల్యేతో అన్నారు. తులం బంగారం, కౌలు రైతుకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదని, నీళ్లు రావడంలేదని అన్నారు. కాంగ్రెస్ మంత్రులు ఎవరూ కూడా గ్రామానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.