కరీంనగర్ స్మార్ట్ సిటీ మిషన్ కు ఇచ్చిన గడువు మార్చి-2025 లోగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులన్నిటినీ పూర్తి చేస్తామని బుధవారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న ఎస్. పివి, ఐసిసిసీ, డిఆర్ఎఫ్ నూతన భవనాన్ని మేయర్ సునీల్ రావు సందర్శించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను వేగంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు.