కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ. తన రాజకీయ జీవితం కరీంనగర్ సిటీ నుంచి సహకార రంగంలో ప్రారంభమైందన్నారు. సహకార రంగాల ద్వారా వరి, మొక్కజొన్న కొనాలని జీవోలు తెచ్చామన్నారు. ఎవరు మార్క్ ఫెడ్కి వచ్చినా గౌరవంగా ఉండేలా సహకార రంగాన్ని తీర్చిదిద్దామని స్పష్టం చేశారు.