బీజేపీ వ్యవస్థాపకులు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నివాళులు

54చూసినవారు
బీజేపీ వ్యవస్థాపకులు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నివాళులు
మనకొండూరు నియోజకవర్గం, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ఎనుగుల అనీల్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో దండు కొమురయ్య, దసారపు నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్