సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాటిని నిరసిస్తూ శంకరపట్నం జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ రహీమ్ కు వినతిపత్రం అందించారు. జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకను అణచివేస్తున్న పోలీసుల వైఖరి నశించాలన్నారు.