
మా వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది: పాక్ సైన్యం
పాకిస్తాన్లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడుల విషయాన్ని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదరి ధ్రువీకరించారు. పాక్ సైన్యం హెడ్క్వార్టర్ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్ఖాన్, చక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి. వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని పాక్ సైన్యం పేర్కొంది.