దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం మంగళవారం ఉదయం 11. 35 గంటల నుండి మీ- సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా సదరం సర్టిఫికేట్ కావాల్సిన వారు, తాత్కాలిక సదరం సర్టిఫికేట్ ఉన్న వారు రెన్యువల్ కొరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.