కాంగ్రెస్ ఆధ్వర్యంలో వన మహోత్సవం

75చూసినవారు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో వన మహోత్సవం
ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీ హెచ్ఎస్ హైస్కూల్ లో 75వ వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, ముత్తారం మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మహిళా మండల అధ్యక్షురాలు గోవిందుల పద్మ ఆనంద్ లు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు అనుము సమ్మయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్