దారిని పరిరక్షించాలని వినతి

64చూసినవారు
దారిని పరిరక్షించాలని వినతి
పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వ్యవసాయ భూములకు వెళ్లేందుకు పురాతన కాలం నుండి ఉన్న దారిని పరిరక్షించాలని గ్రామస్థులు కోరారు. శనివారం అదనపు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్ కు సమస్యను వివరించి పిర్యాదు చేశారు. గాండ్ల మల్లేశం, బొల్లం తిరుపతి, దామెరకొండ మల్లయ్య, తోట కాంతయ్య, ఓదెల రాజు, మ్యాకల రాజయ్య, గురిజాల లక్ష్మయ్య, తిరుమలేశ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్