పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి గ్రామంలో శుక్రవారం ఉపాధిహామీ కూలీలకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం కల్పించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్ ఆదేశాల మేరకు నశాముక్త భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల గ్రామాల్లో డ్రగ్స్ పట్ల, పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపాధి పనులకు వెళ్ళే కూలీలు తమ ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తూ కంట కనిపెట్టాలని తెలిపారు.