పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టిక్ ట్యాంకులో పడి చికిత్స పొందుతున్న బాబు కుటుంబానికి న్యాయం చేయాలని బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో చేశారు. ఆసుపత్రి ఎదుట రోడ్డుపై నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు, అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, తంగెడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్ రావు, మేకల శ్రీనివాస్ పాల్గొన్నారు.