పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మంగళవారం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు సురేష్ కుమార్, అటెండర్ లింగయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.