ఎండపల్లి మండలం కొత్తపేట శ్రీ సీతారామ ఆంజనేయస్వామి దేవాలయ ధూప దీప నైవేద్య అర్చకుడు విధులు నిర్వహించడం లేదు. నిత్య పూజలు నిర్వహించక పోవడం పట్ల బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ధూపం సుగంధ ద్రవ్యాలతో పొగ, దీపం దీపారాధన, నైవేద్యం ప్రసాదం అను నిత్యం శ్రీ స్వామికి సమర్పించాలి కాని ఈ క్రతువులు జరగడం లేదని అంటున్నారు.