పెద్దపల్లి మండలంలో భారీ వర్షాల కారణంగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆదివారం ఎడతెరిపిలేని వర్షానికి పెద్దపల్లి మండలం కొత్తపల్లి- దస్తగిరిపల్లి గ్రామాల మధ్య గల లో- లెవల్ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలు నిలిపి వేశారు.