రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం ఓదెల మండలం బాయమ్మపల్లి, శానగొండ, రూపునారాయణ పేట, జీలకుంట గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానన్నారు.