

"మేము దేనికైనా రెడీ.. ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాం" (video)
భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం నిర్ణయంపై పూర్తి గౌరవం ఉందని మీడియా ముందు కమోడోర్ రఘు ఆర్ నాయర్ వెల్లడించారు. అలాగే, భారత భూభాగ సార్వభౌమత్వం, సమగ్రతను రక్షించడంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాయని స్పష్టం చేశారు. పాక్ చేసిన ప్రతి దాడికి భారత్ ధైర్యంగా ప్రతిస్పందించిందని, భవిష్యత్లో ఎలాంటి సవాల్ వచ్చినా దానికి ఎదుర్కోవడానికి ఫుల్ ప్రిపేర్ అయ్యి ఉన్నామన్నారు.