

డ్రోన్లతో పాక్ దాడులు.. రాజస్థాన్లో రెడ్ అలర్ట్ (వీడియో)
భారత్ పై పాకిస్తాన్ రెండో రోజు కూడా మోర్టర్ షెల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని బార్మర్కు పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తిగా బ్లాక్అవుట్ను అనుసరించాలని సూచించారు. ఎలాంటి లైట్లను ఉపయోగించవద్దు. వాహనంలో బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. పాక్ మొత్తంగా ఏడు ప్రాంతాల్లో దాడి చేసినట్లు భారత్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.