
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే జి.లోక్నాథ్ మృతి
AP: కర్నూలు జిల్లా ఆలూరు శాసనసభ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జి.లోక్నాథ్ మృతి చెందారు. గుండెపోటుతో హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. జి.లోక్నాథ్ స్వగ్రామం ఆలూరు మండలంలోని మొలగవల్లి గ్రామం. కాగా, 1989లో ఆలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జి.లోక్నాథ్ పోటీ చేసి గెలిచారు. ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.