పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం జరిగింది. గోదావరిఖని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలో సోమవారం వాటర్ ట్యాంక్ పై నుంచి ఓ యువకుడు దూకాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు స్థానిక అంబేద్కర్ నగర్కు చెందిన యతిరాజ్ చంద్రశేఖర్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.