సింగరేణి సంస్థలో సెలవులు రద్దు చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులు, పౌర రక్షణ కసరత్తుల దృష్ట్యా ప్రతి అధికారి తమ పని ప్రదేశంలో ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు సెలవులను రద్దు చేసి అధికారులందరూ అందుబాటులో ఉండాలని, సెలవులో ఉన్న వారు వెంటనే విధులకు హాజరై రిపోర్టు చేయాలని ఆదేశించారు.