కార్మిక హక్కులను కాపాడేందుకే దేశవ్యాప్త సమ్మె తలపెట్టినట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వై. యాకయ్య పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లిలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు వీడి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త సమ్మెను జిల్లాలో విజయవంతం చేయాలన్నారు.