నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసమే ఈనెల 20న దేశవ్యాప్త సమ్మెకు చేపట్టినట్లు సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు అన్నారు. శుక్రవారం ఆర్జీ-3 ఏరియా ఏఎల్పీ గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించగా, హెచ్ఎంఎస్- రియాజ్ అహ్మద్, ఐఎఫ్టీయు- కృష్ణ, టిఎస్ యుఎస్- కుమారస్వామి, ఏఐఎఫ్టీయు- రాములు, టిఎన్టీయుసి- ఏడుకొండలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.