ఓపెన్ కాస్ట్2 లో మట్టి పెల్లలు కూలి పిట్టర్ కార్మికుడు ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ కార్మికుడు విద్యాసాగర్ ల మృతికి ఓసిపి టు రక్షణ అధికారుల నిర్లక్ష్యమేని బుధవారం ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్ అన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు కోట్ల రూపాయలు ఎక్స్రేసియా చెల్లించాలన్నారు. మృతుల కుటుంబాలను సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలని విశ్వనాథ్ కోరారు.