ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా నేడు 22 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.