రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన తంగళ్ళపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. సిరిసిల్ల వైపు నుండి మండేపల్లి వైపు టర్న్ అవుతున్న దొంతుల సాయికుమార్ ను సిద్దిపేట నుండి నుండి సిరిసిల్ల వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో సాయికుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రున్ని ఆటోలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.