ఒకే రోజు వేరువేరు ఇళ్లలో చోరీ చేసి దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన చందుర్తి మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వినోద గత 25 రోజుల క్రితం తన కొడుకు దగ్గర ఉండడానికి హైదరాబాద్ వెళ్ళిందని, ఇంట్లో ఎవరూ ఉండడం లేదని తెలుసుకొని తాళం పగులగొట్టి ఇంట్లో చొరబడి తన బీరువాలో దాచుకున్న రూ. 25 వేలు దొంగలు ఎత్తుకెళ్లారని అన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.