డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని వాహనదారులకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్ధాలను వివరించినట్లు తెలిపారు. సుమారు 100 మంది వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారని, కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు.