మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులేనని వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నెంబర్ ప్లేట్ ట్యాపరింగ్ చేసిన, సగం నెంబర్ ప్లేట్ కలిగి ఉన్న వాహనదారులపై క్రిమినల్ కేసులే తప్పవని హెచ్చరించారు. మద్యం త్రాగి వాహనాలు నడిపితే మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి అన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ స్పెషల్ డ్రైవ్ లో 1223 కేసులు చేసినట్లు డిఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.