వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానం డోలోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండువగా ప్రారంభమైంది. ముందుగా అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని రంగు రంగుల పుష్పాలతో శోభయమానంగా అలంకరించారు. త్రిరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత శివ కళ్యాణ మహోత్సవాల సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని అర్చకులు చెబుతున్నారు.