రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. భూక్య లింబ నాయక్ (52) శనివారం ఉదయం 3 గంటలకు ఛాతిలో నొప్పి వస్తోందని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.