రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాత్రి కురుస్తున్న ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత రెండు రోజులుగా వాతావరణం మేఘావృతమై దర్శనమిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.