ఆదివారం తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా రాజన్న గుడిలో సాధారణ భక్తుల ప్రతి కల్పిస్తోంది. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా కుటుంబ సమేతంగా సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అందరిని చల్లగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం వేడుకున్నారు.