మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి కూడా రాకపోవడం బాధాకరమని వేములవాడ మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు కోయినేని బాలయ్య అన్నారు. మున్నూరు కాపు సంఘ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గెలిచిన ఏకైక మున్నూరు కాపు వ్యక్తి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి విస్తరణలో చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించి మంత్రి పదవి ఖరారు చేయాలని కోరారు.