వేములవాడ రాజన్న గోశాలకు రైతులు గడ్డి వితరణ చేస్తున్నారు. శనివారం రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పాపురంలోని గోషాలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన కునుకుల రాముని పల్లె మారుతి నగర్ కు చెందిన జానకి రామ్ ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ వారు 45 ట్రాక్టర్ల వరిగడ్డిని భక్తి భావంతో గోశాల ఏఈఓ బ్రహ్మన్నగారి శ్రీనివాస్ కు అందజేశారు.