
అహ్మదాబాద్ విమానాశ్రయంలో మోదీ సమీక్ష
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఘటన జరిగిన వెంటనే అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, కేంద్ర మంత్రులు, స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు, బాధితులకు మెరుగైన చికిత్స, DNA గుర్తింపు ప్రక్రియలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు.