వేములవాడ రాజన్నను స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే స్టేట్ (ఐజెయూ)అధ్యక్షుడు విరాహత్ అలీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకోవడంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తర్వాత అర్చకులు అద్దాల మండపంలో ఆశీర్వదించగా లడ్డూ ప్రసాదం ఈవో వినోద్ అందజేశారు. వారి వెంట ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు.