ఎండ తీవ్రతతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే. సదరు రాజన్న భక్తులు ఆలయ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ వేసవి నేపథ్యంలో ప్రత్యేకమైన చలువ పందిళ్లతో పాటు కూలర్లు, ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని భక్తులు, హిందూ సంఘాలు కోరుతున్నాయి.