ఈ నెల 13 వ తేదీన పాలిసెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పాలిసెట్ నిర్వహణ పై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడు కేంద్రాలు 2136 మంది విద్యార్థులు రాయనున్నారని పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.