వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని పున: ర్నిర్మాణం చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలయ విస్తీర్ణం చేయడం కోసం రూ. 76 కోట్లు, అన్నసత్రం నిర్మాణం కోసం రూ. 35కోట్లు కేటాయించి గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా శంకుస్థాపన చేసుకున్నట్లు గురువారం గుర్తుచేశారు. ఆలయ, పట్టణ అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని ప్రధాన రహదారి వెడల్పు కోసం రూ. 47 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.