కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ముడా కుంభకోణంపై బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈయనతో పాటు ఆయన భార్య, మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసింది. సీబీఐ దాఖలు చేసిన అప్పీల్తోనే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వారిని విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ సిద్దరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.