వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు ఏకంగా సినిమాలు తీశారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను నెలకొల్పి నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ‘స్పై’ సినిమా నిర్మించారు. తెలుగుతో సహా ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని 2023 జూన్ 29న విడుదల చేశారు. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది.